ప్రస్తుతం భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్ లపై నిషేధం విధించింది. కరోనా సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని సూచించిన మోదీ బీ వోకల్ ఫర్ లోకల్ అనే పిలుపునిచ్చారు. ఆత్మనిర్భరభారత్ కు కట్టుబడాలని నినదించారు. చైనా ఉత్పత్తులపై నిషేధం విధించాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్- చైనాల్లోని ఫౌండర్స్ గురించి తెలుసుకుందాం..
ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ ఫోన్ ఉత్పత్తిదారులలో ఒకటైన షియోమిని లీ జున్ స్థాపించాడు. ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్ ని కూడా సృష్టించాడు.
ఫోన్ల తయారీ సంస్థ అయిన మైక్రో మ్యాక్స్ ను రాహుల్ శర్మ ప్రారంభించారు. భారత్ లో తయారైన మొదటి ఫోన్ ఇది. ఇది గుర్గావ్ కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
సోలార్ ప్యానెల్ టెక్నాలజీలో ప్రత్యేకత కలిగిన పునరుత్పాదక ఇంధన దిగ్గజం హానర్జీ హోల్డింగ్ గ్రూప్కు లి హెజున్ చైర్మన్. అతని సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్లాంట్లలో ఒకటి కూడా నడుపుతోంది.
టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ సౌర శక్తి సేవల్లో ప్రత్యేకత కలిగిన భారతీయ సంస్థ. సౌర విద్యుత్ ప్రాజెక్టులకు EPC సేవలను అందిస్తుంది.
వీరే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో తమ మేధోశక్తితో వినూత్న పరికరాలను కనిపెట్టినవారు కూడా ఉన్నారు.
నల్లగొండ జిల్లాకు చెందిన మత్స్య కార్మికుడు గోదాసు నర్సింహ చేపలు పట్టడానికి చెరువుల్లో ప్రతిబంధకంగా మారిన గుర్రపు డెక్కను తొలగించే యంత్రాన్ని రూపొందించాడు. అందుకుగాను ఆయనను ‘గాంధీయన్ యంగ్ టెక్నలాజికల్ ఇన్నోవేషన్’ అవార్డు వరించింది.
పెద్దపల్లి జిల్లాకు చెందిన వెల్డర్ పిట్టల రాములు పొలాన్ని చదును చేసే యంత్రం "జంబూ లెవలర్"ని కనిపెట్టారు. దీనికిగానూ కలెక్టర్ దేవసేన చేతులమీదుగా "ఇన్నోవేషన్" అవార్డును కూడా అందుకున్నారు.
మంచిర్యాల జిల్లా రామాయంపేట మండల వ్యవసాయాధికారి రాజనారాయణ పంటకు హాని చేసే తల్లి పురుగులను పట్టే సాధనాన్ని అతి తక్కవ ఖర్చుతో తయారు చేశారు. ఈ యంత్రం వల్ల రైతులకు చాలా మేలు జరుగుతుంది.
భారత్ లో జాక్ మా లాంటి వారెందరో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్టీవ్ జాబ్స్ లాంటి వారు కూడా చాలామంది ఉన్నారు. వారికి ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు.
దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలపండి.