దక్షిణ అమెరికా ప్రాంతంలో పుర్రెలతో హెల్మెట్ ఉన్న అస్తిపంజరాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే పుర్రెలను హెల్మెట్ లాగా ఉపయోగించడం వెనక ఉన్న రహస్యం ఏంటనేది వారి పరిశోధనలకు పునాది వేసింది. సెంట్రల్ ఈక్వెడార్లోని సలాంగో పురావస్తు ప్రదేశంలో 11 ఖననాలలో అవశేషాలను పరిశోధకులు కనుగొన్నారు. క్రీస్తుపూర్వం 100వ సంవత్సరంలో దక్షిణ అమెరికా దేశంలోని పసిఫిక్ తీరంలో ఉన్న కర్మ అనే ప్రాంతాన్ని అంత్యక్రియల వేదికగా గ్వాంగాలా అనే బృందం ఉపయోగించింది. "మానవ తల అనేది దక్షిణ అమెరికా సంస్కృతులకు శక్తివంతమైన చిహ్నం" అని పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు.షార్లెట్లోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయం నుండి వచ్చిన 11 మంది బృంద సభ్యులు రెండు శ్మశాన వాటికలలో అవశేషాలను కనుగొన్నారు. వారు అక్కడ చనిపోయిన ఇద్దరు శిశువుల తలలపై ఇతర పిల్లల పుర్రెలను పెట్టడాన్ని గమనించారు. అవి పుర్రెల నుంచి తయారైన హెల్మెట్లుగా గుర్తించారు. పురాతన దక్షిణ అమెరికాలోని బేబీలను మానవ పుర్రెలతో తయారు చేసిన హెల్మెట్ ధరించి ఖననం చేసినట్లు వారి కొత్త అధ్యయనం తెలిపింది.శ్మశానంలో గుర్తించిన 11 అస్తిపంజరాలలో, ఇద్దరు శిశువులను ఇతర బాలల కపాలపు సొరంగాల నుండి తయారైన 'హెల్మెట్'లతో కలిపినట్లు పరిశోధకులు తమ నివేదికలో రాశారు. శిశువుల తలపై పుర్రెల హెల్మెట్లను ఉంచినట్లు బృందం తెలిపింది. మాంసం ముద్దతో ఉన్న పుర్రెలను చూసి పరిశోధకులు కూడా భయపడ్డారు. ఆ అవశేషాలు ఎవరికి చెందినవో గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇటువంటి చర్యలు ఆత్మల రక్షణను నిర్ధారించే ప్రయత్నాన్ని సూచిస్తున్నాయని వారు అంచనా వేశారు. ఈ ప్రాంతంలో అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించిందని, ఎన్నో వినాశకరమైన సంఘటనలు సంభవించాయని పరిశోధకులు గుర్తించారు. ఆహార ఉత్పత్తి జరగక పిల్లలలో చాలామంది పోషకాహార లోపానికి గురై మరణించినట్లు తేలింది. అయితే ఇప్పటికీ ఆ పుర్రెల హెల్మెట్ కు సంబంధించిన విషయం మాత్రం ఒక మిస్టరీగానే మిగిలి ఉంది.