ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాకు మరో షాక్.. వాటిపై నిషేధం

national |  Suryaa Desk  | Published : Thu, Jul 02, 2020, 12:56 PM

చైనాకు భారత్ మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే 59 మొబైల్ యాప్ లను నిషేధించిన కేంద్రం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారి నిర్మాణ ప్రాజెక్టుల్లో చైనా సంస్థలపై నిషేధం విధించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. హైవే ప్రాజెక్టుల్లో ఇకపై చైనా కంపెనీలను అనుమతించబోమని రోడ్డు రవాణా, హైవేలు, ఎంఎస్ఎంఈ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.హైవే ప్రాజెక్టుల్లో పాల్గొనే చైనా సంస్థలపై నిషేధం విధించేలా త్వరలోనే ఓ విధానాన్ని తీసుకు వస్తామన్నారు. మరోవైపు హైవే ప్రాజెక్టుల్లో పాల్గొనేందుకు భారత కంపెనీల అర్హత ప్రమాణాలు పెంపొందించేలా నిబంధనలను సడలిస్తామని గడ్కరీ అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లోనూ చైనా పెట్టుబడులను ప్రోత్సహించబోమన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com