సాధారణంగా మానవులు తమ అభిరుచులకు తగ్గట్టు ఉండేందుకు ఎంత ఖర్చు అయిన పెడుతారు. అది వారు తినే వస్తువైనా, వాడే వస్తువైనా అంతే. నేటి శకంలో మొబైల్ ఫోన్లు ప్రతి ఒక్కరికీ అవసరమయ్యాయి.అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ తాజా మరియు మంచి స్మార్ట్ ఫోన్లను తమ హోదా ప్రకారం కొనుగోలు చేయాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరి ముందు వారి ఉన్నత స్థాయిని చూపించడానికి ఖరీదైన మొబైల్ ఫోన్ ను ఉంచాలనుకుంటున్నారు. ఇక ధనవంతుల గురించి మాట్లాడితే వారి మొబైల్ ఫోన్లు మార్కెట్లో ఎంత ఖరీదైనవిగా ఉన్నాయో ఊహించలేరు. అయితే మీరు ఇప్పటి వరకూ వినని ఓ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకోవాలి. రూ.315 కోట్లు విలువ చేసే ఫాల్కన్ సూపర్ నోవా ఐఫోన్6 పింక్ డైమండ్ ఫోన్ చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ప్రపంచ ఖరీదైన స్మార్ట్ ఫోన్ల జాబితాలో చేరింది.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ రూ.315 కోట్ల విలువ చేసే స్మార్ట్ ఫోన్ వాడుతోందని చాలా కాలంగా సోషల్ మీడియాలో వైరల్ పోస్టులు చలామణి అవుతున్నాయి. ఆ పోస్టుల ప్రకారం.. ముఖేష్ అంబానీ కుటుంబంలోని అందరూ బ్లాక్ బెర్రీ ఫోన్ లను వాడుతుంటారు. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నీతా అంబానీ మాత్రం తనకున్న గాడ్జెట్స్ మీద ఆసక్తి కొద్దీ ఫాల్కన్ సూపర్ నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ ఫోన్ ని వాడుతోంది. దీని ధర అక్షరాలా 48.5 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో 315 కోట్ల రూపాయలు.
స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత ఇదే:
ఆపిల్ సంస్థ స్పెషల్ ఆర్డర్ మీద ఈ స్మార్ట్ ఫోన్ ను తయారు చేస్తుంది. ఫోన్ బాడీలో 24 కారెట్ గోల్డ్ వాడబడుతుంది. ఫోన్ పగిలిపోకుండా ఉండడానికి ప్లాటినం కోటింగ్ వేయబడి ఉంది. ఈ ఫోన్ ను హ్యాక్ చెయ్యడానికి అస్సలు సాధ్యపడదు. ఎవరైనా ట్రై చేస్తే ఓనర్కి ఓ మెసేజ్ వెళ్తుంది.
వాస్తవం ఇది:
సోషల్ మీడియాలో నీతా అంబానీ వాడుతున్న ఫోన్ గురించి చలామణి అవుతున్న వార్త ఇది. అయితే రిలయన్స్ జియోకి జనరల్ మేనేజర్గా వ్యవహరిస్తున్న అనుజ శర్మ ఇది ఫేక్ న్యూస్ అన్న విషయాన్ని స్వయంగా నిర్థారించారు. ముఖేష్ అంబానీ కుటుంబంలో ఎవ్వరూ ఇలాంటి ఫోన్ వాడటం లేదని, ఇలాంటి నకిలీ వార్తలను నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని ఆమె తెలిపారు.
మీరు కేవలం ఒక ఆట ఆడటం ద్వారా డబ్బు సంపాదించడానికి ఆసక్తి కలిగి ఉంటే, ఈ క్రింది లింక్పై క్లిక్ చేయండి..లక్షలు సంపాదించుకునే అవకాశం పొందండి...
rummyculture.onelink.me/WTkY/LokalArticle