ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్యాక్టరీలో భారీ పేలుడు..

national |  Suryaa Desk  | Published : Wed, Jul 01, 2020, 01:13 PM

ఫ్యాక్టరీల నిర్వహణలో తీవ్ర లోపాలు ఉన్నట్లు మరోసారి రుజువైంది. తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌లో మళ్లీ భారీ పేలుడు సంభవించింది. ఈ రోజు ఉదయం రెండో యూనిట్‌లోని బాయిలర్‌ తీవ్ర ఒత్తిడితో పేలిపోయింది. ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా, 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఎన్‌ఎల్సీ ఆస్పత్రికి తరలించారు.
ఇదే ఫ్యాక్టరీలో మే 8న జరిగిన ప్రమాదంలో ఎనిమిది గాయపడ్డారు. ఈ ఫ్యాక్టరీ ఏటా 3 లక్షల టన్నుల లిగ్నైట్ ఉత్పత్తి చేస్తోంది. అంతకు ముందురోజే విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్‌లీకైంది. తర్వాత సిర్పూర్ కాగజ్ నగర్, రాయ్‌పూర్, అహ్మదాబాద్, సూరత్ తదితర నగరాల్లోని ఫ్యాక్టరీల్లో పేలాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com