ఫ్యాక్టరీల నిర్వహణలో తీవ్ర లోపాలు ఉన్నట్లు మరోసారి రుజువైంది. తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్లో మళ్లీ భారీ పేలుడు సంభవించింది. ఈ రోజు ఉదయం రెండో యూనిట్లోని బాయిలర్ తీవ్ర ఒత్తిడితో పేలిపోయింది. ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా, 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఎన్ఎల్సీ ఆస్పత్రికి తరలించారు.
ఇదే ఫ్యాక్టరీలో మే 8న జరిగిన ప్రమాదంలో ఎనిమిది గాయపడ్డారు. ఈ ఫ్యాక్టరీ ఏటా 3 లక్షల టన్నుల లిగ్నైట్ ఉత్పత్తి చేస్తోంది. అంతకు ముందురోజే విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్లీకైంది. తర్వాత సిర్పూర్ కాగజ్ నగర్, రాయ్పూర్, అహ్మదాబాద్, సూరత్ తదితర నగరాల్లోని ఫ్యాక్టరీల్లో పేలాయి.