బంగ్లాదేశ్లో విషాదం చోటుచేసుకుంది. నదిలో ప్రయాణిస్తున్న రెండు పడవలు ఢీకొట్టుకోవడంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ లోని బురిగంగా నదిపై ఓ రెండు పడవలు నీటిలో దూసుకుపోతున్నాయి.మార్నింగ్ బర్డ్ అనే పడవ మున్షిగంజ్ నుంచి సదర్ ఘాట్ వైపు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో మరో పడవ మౌయూరీ-2 అనే పడవను ఢీకొట్టింది. దీంతో ఓ పడవ నీటిలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో ఆ పడవలో 50 మంది ఉన్నట్లు సమాచారం. పడవ నీటిలో మునగగానే కొంతమంది నీటిలో ఈదుకుంటూ ఒడ్డును చేరుకుని ప్రాణాలను దక్కించుకున్నారు. 23 మంది మాత్రం జలసమాధి అయ్యారు. రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతోంది.