ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నదిలో ఢీకొన్న పడవలు.. 23 మంది మృతి

national |  Suryaa Desk  | Published : Tue, Jun 30, 2020, 01:40 PM

బంగ్లాదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. నదిలో ప్రయాణిస్తున్న రెండు పడవలు ఢీకొట్టుకోవడంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ లోని బురిగంగా నదిపై ఓ రెండు పడవలు నీటిలో దూసుకుపోతున్నాయి.మార్నింగ్ బర్డ్ అనే పడవ మున్షిగంజ్ నుంచి సదర్ ఘాట్ వైపు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో మరో పడవ మౌయూరీ-2 అనే పడవను ఢీకొట్టింది. దీంతో ఓ పడవ నీటిలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో ఆ పడవలో 50 మంది ఉన్నట్లు సమాచారం. పడవ నీటిలో మునగగానే కొంతమంది నీటిలో ఈదుకుంటూ ఒడ్డును చేరుకుని ప్రాణాలను దక్కించుకున్నారు. 23 మంది మాత్రం జలసమాధి అయ్యారు. రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com