చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం.. భారత ప్రభుత్వం 59 చైనా మొబైల్ యాప్లను నిషేధించింది. టిక్టాక్, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, హెలో, వైబో, డియూ క్లీనర్, డియూ బ్రౌజర్ తదితర 59 యాప్లను కేంద్రం నిషేధించింది. భారత్ - చైనా సైనికుల ఘర్షణలలో 20 మంది భారత సైనికులు మృతి చెందడం దేశ వ్యాప్తంగా చైనా పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. చైనా ఉత్పత్తులను నిషేధించడం ద్వారా భారత వీర జవాన్లకు నివాళులు అర్పించాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ నేపధ్యంలో భారత ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. చైనాతో లింక్ ఉన్న 59 మొబైల్ అప్లికేషన్లను బ్లాక్ చేయాలని లేదా వాటిని వాడకుండా దేశ ప్రజలకు పిలుపునివ్వాలని సూచనలు చేశారు. ఈ జాబితాలో మనవాళ్లు అధికంగా వాడుతున్న జూమ్ యాప్, టిక్టాక్, యూసీ బ్రౌజర్, జెండర్, షేర్ఇట్, క్లీన్ మాస్టర్తో పాటు మొత్తం 59 అప్లికేషన్లు ఉన్నాయి.