భారత్ లో గత 24 గంటల్లో 19,459 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,48,318కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 3,21,722 మంది కోలుకోగా 16,475 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 2,10,120 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత నెల నుంచి భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నమోదవుతున్న కేసులు ఆందోళనను కలిగిస్తున్నాయి.