దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. అన్ని వర్గాల ప్రజలను ఈ వైరస్ వణికిస్తోంది. తాజాగా ఈ మహమ్మారి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కొవిడ్-19 పాజిటీవ్ ఉన్నట్లు గుర్తించారు. కరోనా వైరస్ సోకిన ఓ స్థానిక కార్పొరేటర్ నుంచి ఆయనకు ఇన్ఫెక్షన్ వ్యాపించినట్లు గుర్తించామని అధికారి వెల్లడించారు. ఇంతకు ముందు మహారాష్ట్రలో ముగ్గురు మంత్రులకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల పాటు చికిత్స పొందిన వీరంతా ఇటీవల కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.