దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. అనేక మంది ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తమిళనాడులోని చెంగల్పేట్ జిల్లా చెయ్యూర్ నియోజకవర్గ డీఎంకే ఎమ్మెల్యే ఆర్ టీ అరసుకు కరోనా సోకినట్లు అధికారులు నిర్దారించారు. ఈ మేరకు శనివారం ఉదయం అధికారులు ప్రకటన చేశారు. అరసు కుటుంబ సభ్యులు కూడా కరోనా టెస్టుల కోసం నమూనాలను ఇచ్చారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. డీఎంకేలో కరోనా బారినపడిన మూడో ఎమ్మెల్యే అరసు. ఇప్పటికే కరోనా మహమ్మారి వల్ల డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ మృతిచెందిన విషయం తెలిసిందే. మరో ఎమ్మెల్యే కే.కార్తికేయన్కు కూడా కరోనా సోకింది. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా.. ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడ్డారు.