భారత దేశంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18, 552 కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకూ ఒక్క రోజులో ఇంత ఎక్కువ కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటి... 5,08,953కి చేరింది. గత 24 గంటల్లో 384 మంది చనిపోవడంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 15685కి పెరిగింది. తాజాగా 10244 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అందువల్ల మొత్తం కోలుకున్న వారి సంఖ్య 295880కు చేరింది. ఫలితంగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,79,387గా ఉంది. ఐతే... ఇండియాలో... రికవరీ రేటు పెరుగుతోంది. తాజాగా అది 58.1గా ఉండటం శుభసూచకమని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల రేటింగ్ 9 శాతంగా ఉండగా... ఇండియాలో అది 3.1 శాతంగా ఉండడం సైతం ఉపశమనం కలిగించే అంశం. అయితే మొత్తం కేసుల్లో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉండడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు. తాజాగా జూన్ 26న 2, 20,479 మందికి కరోనా టెస్టులు చేశారు. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 79,96,707కి చేరింది. మన దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 8.41 శాతంగా ఉంటోంది. ప్రస్తుతం టెస్టుల సంఖ్య పెంచడం వల్లే... కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రోజువారీ కొత్త కేసుల్లో ఇండియా టాప్ 3లో ఉంది. మొత్తం మరణాల్లో టాప్ 8లో ఉండగా... రోజువారీ కొత్త మరణాల్లో మాత్రం ఇండియా టాప్ 4లో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.