కరోనా వైరస్ కారణంగా మార్చి నుండి క్రికెట్ ఆడకపోయినా ఆట గురించి మాత్రం ఆలోచించడం ఆపలేదు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్, ఎంతగా అంటే, అతను భారతదేశంలో జరిగే 2023 వన్డే ప్రపంచ కప్ కోసం ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ 20 ప్రపంచ కప్ కు కరోనా మహమ్మారి కారణంగా అవకాశం లేదని, దాంతో 2021 లో జరిగేదానికి భారత్ కు హక్కులు ఉన్నాయని చెప్పారు. అలాగే 2023 లో భారతదేశం వన్డే ప్రపంచ కప్ ఈవెంట్ను కూడా నిర్వహిస్తుంది అని ఫించ్ అన్నారు.
టీ 20 ప్రపంచ కప్ లో ఏమి జరుగుతుందో తెలియదుకాని, మేము 2023 లో జరిగే 50 ఓవర్ల ప్రపంచం కోసం చూస్తున్నాము. మేము దానిని ఎలా గెలుచుకోవాలో తెలుసుకునే ప్రక్రియలో ఉన్నాము, ఆ టోర్నమెంట్లలో విజయవంతం కావడానికి మేము ఏమి చేయాలి అనేది చర్చిస్తున్నాము అని తెలిపాడు. భారత్ లో పిచ్ లు ఎక్కువగా స్పిన్నర్లకు సహకరిస్తాయి. అందువల్ల మేము ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలి అనుకుంటున్నాము అన్నాడు.