ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్ పైలట్లలో 40% మందికి ఫేక్ లైసెన్స్!

international |  Suryaa Desk  | Published : Fri, Jun 26, 2020, 01:56 PM

నకిలీ డిగ్రీ, పీజీ, డాక్టర్ సర్టిఫికేట్లు, నకిలీ భూ డాక్యుమెంట్లు, నకిలీ వాహన లైసెస్సులు, ఓటరు కార్డులు.. ఇలాంటి నకిలీల గురించి మనం నిత్యం వార్తల్లో చదువుతూనే ఉంటాం. అయితే పాక్‌లో మాత్రం నకిలీల బెడద విశ్వరూపం దాల్చింది. పాక్‌లో 40 శాతం మంది పైలట్లకు నకిలీ లైసెన్సులే ఉన్నట్లు బయటపడింది. ఒకరో ఇద్దరో ఈ టైపు మనుషులుంటే బహుశా ఇంత ఉపోద్ఘాతం అవసరమయ్యేది కాదేమో. అయితే దురదృష్టవశాత్తూ అక్కడ ప్రతి ముగ్గురు పైలట్లలో ఒకరు ఫేక్ లైన్సెసులతోనే హ్యాపీగా బతికేస్తున్నారని నిర్దారణ అయ్యింది. ఇటీవల జరిగిన విమాన ప్రమాదంతో ఈ విషయం వెలుగు చూసింది. నకిలీ పాస్ పోర్టులున్న విషయాన్ని స్వయానా ఆ దేశ పౌర విమానాయ శాఖ మంత్రి బయటపెట్టారు. చట్టసభల ముందు ఈ విషయాన్ని వెల్లడించారు. ‘దేశంలోని 40 శాతం పైచిలుకు పైలట్లు విమానం నడిపేందుకు అనర్హులు. వారెవరూ పరీక్షకు స్వయంగా హాజరు కాలేదు. తమ తరపున పరీక్ష రాసేందుకు కొందరికి డబ్బులిచ్చి పంపారు. విమానం నడపడంలో వారికి కావాల్సినంత అనుభవం లేదు’ అని నిండు సభలో మంత్రి ప్రకటించారు. పాక్ సంస్థల్లో ప్రస్తుతం దాదాపు 860 పైలట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే నకిలీ లైసెన్సుల గల వారందరినీ ప్రభుత్వం తక్షణం సస్పెండ్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com