నందికొట్కూరు పట్టణంలో పగిడ్యాల రోడ్ నందు గల బైరెడ్డి నగర్ లో 23 లక్షల వ్యయంతో వేస్తున్న సి.సి రోడ్డుకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే శ్రీ తొగురు ఆర్థర్ .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.ప్రణాళిక బద్ధంగా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.కాలనీ పార్కులు, ప్రజా మరుగుదొడ్లు, కూడళ్లలో వీధిదీపాల ఏర్పాటు, శ్మశానవాటికలకు స్థలాలు, సమీకృత మార్కెట్ కోసం స్థలాలు, ఆటస్థలాల ఏర్పాటు, హరిత ఉద్యానవనాలు,మురుగు కాల్వల ఆధునికీకరణ,చెత్త సేకరణ, డంపింగ్యార్డును మెరుగుపర్చడంతో పాటు ఆటోలు, రిక్షాల స్టాండ్లను గుర్తించి, వీధి వ్యాపారుల జోన్ ఏర్పాటు పట్టణ అభివృద్ధి లో భాగంగా చేపడుతున్నట్టు తెలిపారు.మన నందికొట్కూరు పట్టణ అభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో 14th స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద రూ.11.8 కోట్లు,ఎస్సీ.ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కింద రూ.3.5 కోట్లు మొత్తం కలుపుకొని రూ.15.3 కోట్లు,పట్టణ శాశ్వత త్రాగునీటి అవసరాలకు ఏ.ఐ.ఐ.పి ప్రాజెక్ట్ కింద 110 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. పట్టణ సుందరీకరణ, పారిశుధ్య కార్యక్రమాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించినట్టు తెలిపారు. నందికొట్కూరు పట్టణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ కమిషనర్ అంకి రెడ్డి, పట్టణ సి.ఐ. నాగరాజ రావు, పుర ప్రజలు, వైస్సార్సీపీ సీనియర్ నాయకులు శ్రీ చేరుకుచెర్ల రఘురామయ్య, పట్టణ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.