ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండెక్కుతున్న పెట్రోల్,డీజిల్ ధరలు..

national |  Suryaa Desk  | Published : Fri, Jun 26, 2020, 01:10 PM

చమురు ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆకాశమే హద్దుగా రికార్డు స్థాయిలో ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజీల్ ధరలు పెంచుతున్నాయి. వరుసగా 20 రోజులు పెట్రో ధరలు పెంచడంపై వాహనదారులు కేంద్రంపై మండిపడుతున్నారు. శుక్రవారం లీటరు పెట్రోలుపై 21 పైసలు, డీజిల్‌పై 17 పైసలు పెరిగాయి. వరుసగా 20రోజుల పాటు ప్రతి రోజు పెట్రోల్, డీజీల్ ధరలు పెరగడం దేశంలో ఇదే తొలసారి కావడంతో అంతా అవాక్కవుతున్నారు.


తాజా పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.80.13కు చేరింది. డీజిల్ ధర రూ.80.19గా ఉంది. మొన్న తొలిసారిగా పెట్రోల్‌ను మించి డీజీల్ ధర ఉంటే ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతోంది. 20 రోజుల పెంపుతో పెట్రోల్ ధర రూ. 8.93 పెరిగితే.. డీజీల్ ధర రూ. 10.7పైసలు పెరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com