ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరి ఖాతాలో నగదు జమ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 26, 2020, 01:04 PM

2018 సంవత్సరానికి సంబంధించిన రబీ పంటల బీమా సొమ్మును ఏపీ సర్కార్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,94,005 మంది రైతుల ఖాతాలలో రూ.596.36 కోట్లను సర్కార్ నేరుగా జమ చేసింది. సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాలో వేశారు. 2018 రబీ పంటల బీమా కింద ప్రభుత్వం బీమా కంపెనీలకు ప్రీమియంను చెల్లించలేదు. దీంతో రైతులకు చెందాల్సిన రూ. 596.36 కోట్ల రూపాయలను బీమా కంపెనీలు ఆపేశాయి. అప్పటి నుంచి రైతులకు బీమా డబ్బు అందలేదు. దీంతో సీఎం జగన్ దీని పై ఆరా తీసి రైతులకు నగదు అందేలా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com