ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేసిన కేంద్రం..

national |  Suryaa Desk  | Published : Thu, Jun 25, 2020, 04:10 PM

సీబీఎస్ఈ పరీక్షల రద్దు కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు వైరస్ ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణ సందర్భంగా, ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరాలు తెలిపారు. మిగిలిన 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని సీబీఎస్ఈ నిర్ణయించిందని వెల్లడించారు. జూలై 1 నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలని భావించినా, ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.


పరిస్థితులు అనుకూలిస్తే వీలైనంత త్వరగా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. అయితే, పరీక్షలకు హాజరవ్వాలో వద్దో నిర్ణయించుకునే అవకాశం విద్యార్థులకే ఇవ్వనున్నామని తెలిపారు. లేకపోతే, ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా సర్టిఫికెట్ తీసుకునే వెసులుబాటు కూడా వారికి ఇస్తున్నామని వివరించారు. ఈ ఫలితాలను జూలై 15న వెల్లడిస్తామని పేర్కొన్నారు. దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com