కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జులై 31వ తేదీ వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్ డౌన్ ఈ నెల 30తో ముగియనుంది. కేసుల తీవ్రత అధికంగా ఉండటంతో మరో నెల రోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగించాలని ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, కళాశాలలు తెరిచేది లేదని బెంగాల్ సర్కార్ స్పష్టం చేసింది. రైళ్లు, మెట్రో సర్వీసులు కూడా నడవవని చెప్పింది. పశ్చిమ బెంగాల్ లో ఇప్పటి వరకు 14,728 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో అక్కడ 580 మంది ప్రాణాలు కోల్పోయారు. 9,218 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.