పదో తరగతి పరీక్షలు రద్దు కావడంతో.. డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు అవుతాయన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అయితే యూజీ, పీజీ పరీక్షలు రద్దయ్యే అవకాశం లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నామే తప్ప రద్దన్న ప్రశ్న ఉత్పన్నమే కాలేదని ఆయన తేల్చి చెప్పారు.ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థుల పరీక్షలు, రాబోయే విద్యా సంవత్సరంలో చేయాల్సిన పనులపై రాష్ట్రంలో ఉన్న 16 యూనివర్సిటీల వీసీలతో బుధవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితులపై ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశంపై సమీక్షించారు. కరోనా సమయంలో ఇబ్బందులు ఎదురావుకావొద్దని ముందుగా తొమ్మిదో తరగతి లోవు పరీక్షలు రద్దు చేశామన్నారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించాలనుకున్నా.. కేసులు పెరుగుతున్నందున రద్దు చేశామన్నారు.