కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోం మంత్రి విరుచుకుపడ్డారు. 45 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఓ కుటుంబం అధికార దాహంతో దేశంలో ఎమర్జెన్సీ విధించిందని షా గుర్తు చేశారు. దీంతో రాత్రికి రాత్రే దేశం జైలులా మారిందని చెప్పారు. మీడియాను, న్యాయస్థానాలను అణచివేశారని, భావ ప్రకటిత స్వేచ్ఛను తొక్కేశారని షా తెలిపారు. లక్షలాది మంది ప్రజల ఉద్యమం కారణంగా ఎమర్జెన్సీ ఎత్తివేశారని షా గుర్తు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడిందని, అయితే కాంగ్రెస్ కనుమరుగైందని చెప్పారు.