చైనా విస్తరణ కాంక్షకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. భారత భూభాగాలని తమవి చెప్పుకుంటూ వాస్తవాధీన రేఖ వెంబడి అనేక ప్రాంతాల్లో వివాదాలు సృష్టిస్తోంది. గాల్వాన్, పాంగాంగ్ సరస్సు వద్ద ఘర్షణలు పూర్తిగా సద్దుమణగక ముందే.. డెప్సాంగ్ అనే మైదాన ప్రాంతంలో భారత భూభాగాలపై చైనా తాజాగా కన్నేసింది. అక్కడున్న వై జెంక్షణ్ అనే ప్రాంతంలో చైనా పెద్ద ఎత్తున సైనికులను మోహరించినట్టు సమాచారం. టెంట్లు, ఇతర తాత్కాలిక నిర్మాణాలను కూడా చేపట్టినట్టు తెలిసింది. భారత్కు అత్యంత కీలకమైన దౌలత్ బేగ్ ఓల్డీ వైమానిక స్థావరానికి ఆగ్నేయంగా 30 కీమీల దూరంలో వై జంక్షన్ ఉంది. దీంతో చైనా వైఖరి భారత్కు మరింత ఇబ్బంది కలిగించనుంది. మరోవైపు.. వై జంక్షన్ వద్ద మిలటరీ బలగాలతో పాటూ రవాణా వాహనాలు, ఇతల మిలిటరీ పరికాలను పెద్ద ఎత్తున పేర్చిందని ఈ వ్యవహారలతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. కాగా.. సైన్యాల మోహరింపు వెనుక చైనా భారీ వ్యూహాన్నే అమలు చేస్తోందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి వివిధ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెంచడం ద్వారా భారత్ బలగాలపై ఒత్తిడి పెంచేందుకు యత్నిస్తోందని వారు అంటున్నారు.