కరోనాతో టీఎంసీ ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్ మరణించారు. ఆయనకు ప్రస్తుతం 60 సంవత్సరాలు. గత నెలలో ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది. అప్పటి నుంచి ఆయన కరోనాతో పోరాడుతున్నారు. చికిత్స తీసుకున్నా చివరకు ఆయన ప్రాణాలు విడిచారు. తమోనాశ్ ఫాల్తా నియోజకవర్గం నుంచి ఆయన టీఎంసీ తరపున 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1998 నుంచి టీఎంసీ ట్రెజరర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తమోనాశ్ మృతి పై సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ఆమె సంతాపం తెలిపారు.