ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. దీంతో జూన్ 25 నుంచి తూర్పుగోదావరి జిల్లాలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలు నిత్యావసర సరుకులు కొనేందుకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఈ సమయంలోనే షాపింగ్ మాల్స్,హోటల్స్ తెరుచుకుంటాయన్నారు. ఉదయం 11 తర్వాత అన్ని బంద్ చేయాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. సంపూర్ణ లాక్ డౌన్ లో కొనసాగిన నిబంధనలు అమలవుతాయన్నారు.