కర్ణాటక సీఎం యెడియూరప్ప ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 3 నుంచి 4 పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న ప్రాంతాలన్నింటిని గుర్తించి వాటిని పూర్తిగా దిగ్బంధించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆ ఏరియాల్లో వీలైనన్ని టెస్టులు చేయాలని సూచించారు. బెంగళూరులో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. కర్ణాటక రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 9,150 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 137 మంది ప్రాణాలు కోల్పోయారు.