గాల్వన్ లోయలో భారత, చైనా దళాల మధ్య హింసాత్మక ఘర్షణల తరువాత దేశమంతటా చైనాకు వ్యతిరేక వాతావరణం పుంజకుంది. అటు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు భారత సైనికులు శక్తి పాటవాలను కొనియాడుతున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా సైనికుల త్యాగాలను కొనియాడారు. అంతేకాదు చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సురేష్ రైనా మాట్లాడుతూ...తాను ఆర్మీ కుటుంబానికి చెందిన వాడినని, అందువల్ల సైనికుడి కష్ట సుఖాలు తనకు తెలుసు అని పేర్కొన్నాడు. అలాగే సైనికుల జీవితం అంత సులభం కాదని తనకు తెలుసునని, అందుకే తాను చైనా ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఆర్మీ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ సురేష్ రైనా ఆర్మీ సైనికులలో కొంతమందిని కోల్పోవడం నిరాశపరిచిందన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంటుందని తాను ఆశిస్తున్నాను అని రైనా పేర్కొన్నారు. అంతేకాదు అమరవీరుల కుటుంబాలకు ఇది చాలా కష్టమైన సమయం అని పేర్కొన్నారు. సైనికులను ప్రశంసించడానికి నా దగ్గర మాటలు లేవని ఆయన అన్నారు