అది ఉత్తరప్రదేశ్... అలీగఢ్ జిల్లాలోని... అమ్రాద్ పూర్. అక్కడి 10 మంది పిల్లలు. అందరి వయసూ... 7 నుంచి 11 ఏళ్ల లోపే. ఇళ్లను వదిలేసి.... చైనా సరిహద్దు వైపు బయల్దేరారు. ఎందుకో తెలిస్తే... ఒకింత ఆశ్చర్యం కలగక మానదు. పరిగెడుతూ వెళ్తున్న ఆ పిల్లల్ని పోలీసులు అడ్డుకున్నారు. "ఏయ్... ఇటెందుకు వెళ్తున్నారు. అది బోర్డర్ ఏరియా... అటు వెళ్లకూడదు" అని పోలీసులు అనగానే... అవును సార్... అది బోర్డర్ కాబట్టే అటు వెళ్తున్నాం అన్నాడు పిల్లల్లో ఒకడైన కరణ్. "ఎందుకూ" అని అడిగితే... "మన సైన్యాన్ని చంపారు... మన తడాఖా చూపిస్తాం. ప్రతీకారం తీర్చుకుంటాం... భారత్ మాతాకీ జై" అని పిల్లలు నినాదాలు చేశారు.
మీరు పిల్లలు కదా... మరి చైనా సైన్యంతో ఫైట్ చెయ్యగలరా అని అడిగితే... పిల్లలంతా కాన్ఫిడెన్స్తో కచ్చితంగా చేస్తాం అన్నారు. పోలీసులకు ఆ పిల్లల్లో దేశ భక్తి చూసి ముచ్చటేసింది. ఓకే... ఆ సైనికుల వీర మరణానికి మనం ప్రతీకారం తీర్చుకుందాం. ఇప్పటికైతే మీరు ఇళ్లకు వెళ్లండి. బాగా చదువుకోండి అని పోలీసులు వాళ్లకు చెప్పారు.