నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. కశ్మీర్ నుంచి నలుగురైదుగురు ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘావర్గాలు సమాచారం అందించాయి. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు అనుమానిత ప్రదేశాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి వచ్చే అన్ని మార్గాల సరిహద్దుల్లో విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, గెస్ట్హౌస్లు, ఇతర ప్రదేశాల్లో భద్రతాచర్యలు చేపట్టారు.