ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడులోని కోయంబత్తూరులో దారుణం ..సెక్స్ వీడియోలు చూపించి అత్యాచారం

national |  Suryaa Desk  | Published : Mon, Jun 22, 2020, 09:34 AM

టీవీ చూసేందుకు వెళ్లిన బాలికపై కన్నేసిన ఇంటి ఓనర్ కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. ఏడో తరగతి బాలికకి బలవంతంగా సెక్స్ వీడియోలు చూపించి తన ఫ్రెండ్స్‌తో కలసి సామూహిక అత్యాచారం చేశాడు. పదేపదే అత్యాచారం చేస్తూ నరకం చూపించాడు. బాలికకు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. కూతురిపై గ్యాంగ్ రేప్ జరుతున్నట్లు తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటుచేసుకుంది.


నగరంలోని సుందరపురం ప్రాంతానికి చెందిన బాలిక (11) స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఆమె తల్లి గతంలోనే చనిపోవడంతో తండ్రి, అత్తతో కలసి నివాసముంటోంది. ఆమె టీవీ చూసేందుకు కింది అంతస్తులోని ఇంటి ఓనర్ పోర్షన్‌కి వెళ్లేది. ఇంట్లో అందరూ పనికి వెళ్లడంతో అలవాటు ప్రకారం రోజు టీవీ చూసేందుకు ఓనర్ ఇంటికి వెళ్లింది. ఇంటి యజమాని దంపతులు కూడా పనులకు వెళ్లడంతో పదో తరగతి చదువుతున్న ఓనర్ కొడుకు(16), అతని స్నేహితుడు(17) ఉన్నారు.


ఆన్‌లైన్ పాఠాల కోసం సెల్‌ఫోన్‌ ఇచ్చి వెళ్లడంతో ఇద్దరూ కలసి సెక్స్ వీడియోలు చూస్తున్నారు. అదే సమయంలో ఓనర్ ఇంటికి వెళ్లిన బాలిక అశ్లీల వీడియోలు చూస్తున్నట్లు గమనించి తన పోర్షన్‌కి వెళ్లేందుకు వెనుదిరిగింది. ఇంతలో ఇద్దరు మైనర్ బాలురు ఆమెను అడ్డుకుని బలవంతంగా ఆమెకి సెక్స్ వీడియోలు చూపించారు. అనంతరం ఆమె ఫస్ట్ ఫ్లోర్‌లోని తన ఇంటికి వెళ్లింది. ఆమె వెనకే వెళ్లిన ఇద్దరు బాలురు ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు.


సెక్స్ వీడియోలు చూపించి సామూహిక అత్యాచారం చేశారు. ఆమెపై పడి కామకోరికలు తీర్చుకున్నారు. పలుమార్లు అత్యాచారం చేసిన తరువాత మరో స్నేహితుడికి ఫోన్ చేసి పిలిపించారు. అతను కూడా ఆమెను రేప్ చేశాడు. వారం రోజుల అనంతరం మరోమారు ముగ్గురు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. ఎవరికైనా చంపేస్తామని బెదిరించి అత్యాచారానికి తెగబడ్డారు. బెదిరింపులకు భయపడిపోయిన బాలిక మౌనం వహించింది.


కొద్దిరోజుల అనంతరం కడుపునొప్పి రావడంతో బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. తనపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు బాలిక డాక్టర్‌కి చెప్పడంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది బాలిక నుంచి వివరాలు సేకరించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. మూడో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com