కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని భయపెడుతుంది. వ్యాక్సిన్ లేకపోవడంతో వ్యాధి వ్యాప్తి వేగంగా పెరుగుతుంది. కరోనా లక్షణాలకు సంబంధించి రోజుకో రకం లక్షణాలు బయటపడుతున్నాయి. ముందుగా జలుబు,దగ్గు,ఆయాసం,జ్వరం వంటివి కరోనా లక్షణాలుగా వైద్యులు తెలిపారు. ఆ తర్వాత రుచి,వాసన తెలియకపోవడం కూడా కరోనా లక్షణాలేనని భారత ఆరోగ్యశాఖ ప్రకటించింది.ఇప్పుడు తాజాగా కండ్లు ఎర్రబడడం,కండ్లకలక ఉన్నా కరోనా లక్షణమేనని కెనడాలోని అల్జెర్బా విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫేసర్ కార్లోస్ సోలర్టె తెలిపారు. తమ దగ్గరికి వచ్చిన మహిళలో కేవలం కండ్లు ఎర్రబడ్డ లక్షణాలు మాత్రమే ఉన్నాయని ఆమెకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా తేలిందని ఆయన అన్నారు. కాబట్టి కండ్లు ఎర్రబడ్డా, కండ్ల కలక ఉన్నా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కరోనా రోగుల్లో ఎక్కువగా సెంకెడరీ లక్షణంగా కళ్లు ఎర్ర బారడమూ, కండ్ల కలక వంటివి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.