భారత్ లో కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 15,413 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 4,10,461కి చేరింది. నిన్న ఒక్క రోజే 306 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో 2,27,755 మంది కోలుకోగా 13,254 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,69,451 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసుల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. కొత్త కేసుల నమోదులో 3వ స్థానంలో ఉంది. తాజాగా ఇండియాలో కరోనాను జయించేందుకు టాబ్లెట్ల మందు ఫాబిఫ్లూకి అనుమతి లభించడం కూడా కరోనాపై చిన్నపాటి విజయంగానే చెప్పుకోవచ్చు.