తమిళనాడు రాష్ట్రం నాగర్కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఉంది ఈ అద్భుతమైన వినాయక దేవాలయం… అదే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం.ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినప్పటికీ, ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన వినాయకుడు ప్రతి ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం.ఉత్తరాయణ కాలంలో అంటే మార్చి నుంచి జూన్ వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలంలో అంటే జూలై నుంచి ఫిబ్రవరి వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని ఇక్కడి భక్తుల విశ్వాసం.అంతే కాదు, ఇక్కడ మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు ఉండదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే.., ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు తెల్లగానూ వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు నల్లగానూ ఉంటాయి. అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఇక్కడ ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి ధర్మం.. ఇది సహజంగా అందరికి తెల్సిన విషయమే… కానీ ఇక్కడ . ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. వినటానికి ఇదంతా అతిశయంగా ఉన్నా ఇది నిజం. అందుకే ఈ ఆలయాన్ని అతిశయ వినాయకర్ ఆలయం అని అంటారు. కొంతమంది మిరాకిల్ వినాయగర్ ఆలయం అని కూడా అంటారు.ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ,ఈ ఆలయంకు 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా అంతే కాదు ఇక్కడి స్ధానికులు కూడా అదే చెప్తారు.వాస్తవానికి ఈ ఆలయం శివాలయం..ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందుగా శివాలయం ఉంటుంది.. దాని తరవాతే ఈ ఆలయం నిర్మించడం జరిగిందని,అందుకే ఈ ఆలయాన్నిశ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటాఋ.. ఈ ఆలయానికో చారిత్రకపర చరిత్ర కూడా ఉంది.అప్పటి కాలంలో కేరళపురం రాజుగారు తీర్థయాత్రలకని రామేశ్వరంవెళ్లడం జరుగిందట. .అక్కడ రాజుగారు తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తన్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం, సముద్ర కెరటాలలో తడుస్తూ కనిపించిందట.