ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంగులు మార్చే వినాయకుని ఆలయం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 21, 2020, 04:37 PM

తమిళనాడు రాష్ట్రం నాగర్కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఉంది ఈ అద్భుతమైన వినాయక దేవాలయం… అదే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం.ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినప్పటికీ, ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన వినాయకుడు ప్రతి ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం.ఉత్తరాయణ కాలంలో అంటే మార్చి నుంచి జూన్ వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలంలో అంటే జూలై నుంచి ఫిబ్రవరి వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని ఇక్కడి భక్తుల విశ్వాసం.అంతే కాదు, ఇక్కడ మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు ఉండదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే.., ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు తెల్లగానూ వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు నల్లగానూ ఉంటాయి. అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఇక్కడ ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి ధర్మం.. ఇది సహజంగా అందరికి తెల్సిన విషయమే… కానీ ఇక్కడ . ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. వినటానికి ఇదంతా అతిశయంగా ఉన్నా ఇది నిజం. అందుకే ఈ ఆలయాన్ని అతిశయ వినాయకర్ ఆలయం అని అంటారు. కొంతమంది మిరాకిల్ వినాయగర్ ఆలయం అని కూడా అంటారు.ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ,ఈ ఆలయంకు 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా అంతే కాదు ఇక్కడి స్ధానికులు కూడా అదే చెప్తారు.వాస్తవానికి ఈ ఆలయం శివాలయం..ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందుగా శివాలయం ఉంటుంది.. దాని తరవాతే ఈ ఆలయం నిర్మించడం జరిగిందని,అందుకే ఈ ఆలయాన్నిశ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటాఋ.. ఈ ఆలయానికో చారిత్రకపర చరిత్ర కూడా ఉంది.అప్పటి కాలంలో కేరళపురం రాజుగారు తీర్థయాత్రలకని రామేశ్వరంవెళ్లడం జరుగిందట. .అక్కడ రాజుగారు తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తన్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం, సముద్ర కెరటాలలో తడుస్తూ కనిపించిందట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com