ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 21, 2020, 11:21 AM

టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'రాజ్యసభ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనంటూ కళా వెంకట్రావు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ నడుస్తోందని మరో పచ్చనేత. క్రిమినల్స్ రాజ్యసభకు వెళ్తున్నారంటూ సభా మర్యాదకు భంగం కలిగేలా ప్రేలాపన. ఇలా దిగజారి మాట్లాడే బదులు ఆత్మ విమర్శ చేసుకోండి. మీ ఎమ్మెల్యేలే ఛీకొట్టి మీకు ఓటేయలేదని గ్రహించండి' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.


గత టీడీపీ పాలనపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'ఉద్యోగుల కష్టార్జితానికి చంద్రబాబు కన్నమేశారని కాగ్ తేల్చింది. 731 కోట్ల రూపాయల సీపీఎస్ డబ్బును బ్యాంకుకు జమ చేయలేదు. ఉద్యోగుల జీతాల నుంచి పది శాతం కొట్టేశాడు. ప్రత్యేక విమానాలకు, దొంగ దీక్షలకు దుబారా చేశాడు బాబు గారు' అని విజయసాయిరెడ్డి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com