గరీబ్ కల్యాణ్ రోజ్గర్ అభియాన్ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. కరోనా సంక్షోభం కారణంగా నగరాల నుంచి తిరిగి వచ్చిన కార్మికులకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ .50 వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పథకం కింద ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో ప్రజలకు ఉపాధి లభించనుంది. ఈ పథకం కింద ప్రజలకు 25 రకాల పనులు లభిస్తాయి. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. -దేశ గ్రామీణ జనాభా కరోనా సంక్రమణను అత్యంత ప్రభావవంతంగా నివారించిందన్నారు. ఃఃఃపేదల సంక్షేమం కోసం ఈ భారీ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పథకం దేశంలోని మన కార్మికుల కోసమేనన్నారు. బీహార్లోని ఖాగారియా నుంచి ప్రారంభమైన ఈ పథకం మీ అవసరాలను నెరవేరుస్తుందన్నారు. మొత్తం 25రంగాలు గ్రామీణ అవసరాలకు అనుసంధానించబడి ఉంటాయన్నారు. పేదల సంక్షేమ ఉపాధి పథకం కింద ఈ అవసరాలు తీర్చబడతాయన్నారు. నగరాల్లో కంటే దేశంలోని గ్రామాల్లో ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగించబడుతోందన్నారు. ఈ పథకం కింద గ్రామీణ మహిళలను స్వయం సహాయక బృందాలతో అనుసంధానం చేస్తామన్నారు. వలసదారులు వారి నైపుణ్యాలకు అనుగుణంగా పని చేయవచ్చన్నారు. కరోనా మహమ్మారి సమయంలో గ్రామాల్లో నివసించేటప్పుడు కార్మికులు ఎవరి నుండి రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోందన్నారు. రైతులు ఇప్పుడు తమ పంటలను తమ రాష్ట్రాల బయట సైతం అమ్మవచ్చన్నారు.
గరీబ్ కల్యాణ్ రోజ్గర్ అభియాన్ పథకం ముఖ్యాంశాలు;
-ఈ ఉపాధి ప్రచారానికి ఆరు రాష్ట్రాల్లో 116 జిల్లాలను ఎంపిక చేశారు.
-బీహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశాలలో 116 జిల్లాలకు ఈ పథకం ప్రయోజనం లభించనుంది.
-ఈ పథకం కింద కార్మికులకు 125 రోజులు పని కల్పించనున్నారు.
-బీహార్లోని ఖగారియా జిల్లాలోని బెల్దోర్ బ్లాక్లోని తెలిహార్ గ్రామం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ఈ పథకాన్ని ప్రారంభించారు.
-'లాక్డౌన్ తరువాత, దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కార్మికులు తమ గ్రామాలకు వెళ్లారు. రాష్ట్రాలు రవాణాకు కూడా ఏర్పాట్లు చేశాయి. గరిష్ట సంఖ్యలో కార్మికులు తిరిగి వచ్చిన జిల్లాలను కేంద్రం గుర్తిస్తుందన్నారు. ఈ 25 పనుల్లో అంగన్వాడీ కేంద్రాలు, గ్రామీణ రోడ్లు, గ్రామీణ గృహాలు, రైల్వే పనులు, గ్రామీణ ప్రాంతాల్లో రర్బన్ మిషన్, సోలార్ పంప్సెట్లు, ఫైబర్ ఆప్టిక్ కేబులింగ్ మొదలైనవి ఉన్నాయి"అని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.