ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాసనమండలిలో టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది : స్పీకర్ తమ్మినేని సీతారాం...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 20, 2020, 05:03 PM

ఏపీ అసెంబ్లీలో వైసీపీకి అధిక బలం ఉండగా, శాసనమండలిలో మాత్రం టీడీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. దీనిపై అసెంబ్లీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు చేశారు. శాసనసభ అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులతో ఏర్పడుతుందని, అంతిమ నిర్ణయాలు అక్కడే జరుగుతాయని స్పష్టం చేశారు. మండలిలో జరిగే నిర్ణయాలను పట్టించుకోనవసరంలేదని అన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఇది వర్తిస్తుందని తెలిపారు. శాసనమండలిలో టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, ద్రవ్య వినియమ బిల్లును కూడా అడ్డుకున్నారని విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం విపక్షానికి ఇష్టం లేదా? అని మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండల్రిలో పూలే విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం తమ్మినేని ఈ వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com