ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాత్రిళ్లు సరిగా నిద్రపోవడం లేదా? జాగ్రత్త..

national |  Suryaa Desk  | Published : Sat, Jun 20, 2020, 05:03 PM

స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలామంది రాత్రిళ్లు నిద్రలు మానుకొని మరీ వీటిని చూస్తున్నారు. టీవీలు కంటే ఎక్కువగా చేతిలో ఇట్టే ఇమిడిపోయే మొబైల్లోనే సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలను చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి దింపుతున్నారు. అయితే ఫోన్లలో అతిగా నిమగ్నం అవ్వడం వల్ల ముఖ్యంగా రెండు రకాల ప్రమాదాలు పొంచివున్నాయి. ఒకటి మొబైల్ లైటింగ్ వల్ల కళ్లు, రేడియేషన్ వల్ల మెదడు దెబ్బతింటాయి. ఇక రెండోది నిద్రలేమి వల్ల కొత్త వ్యాధులు మనపై దాడి చేస్తాయి.మనకు నీరు, ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంటే అవసరం. తాజా అధ్యయనంలో.. సరిగా నిద్రపోనివారికి ఆయుష్సు తగ్గిపోతుందని తేలింది. రోజుకు మనిషి కనీసం 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. వయోవృద్ధులు, పిల్లలు రోజుకు తప్పనిసరిగా 10 గంటలు నిద్రపోవాలి. సరిగా నిద్రపోకుంటే ఎన్నో రకాల సమస్యలు మిమ్మల్ని వెంటాతాయి. రోజుకు కనీసం 6 గంటలైనా నిద్ర లేకపోతే మనం చేతులారా ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నట్లే.


నిద్రలేమివల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఇవే:


. నిద్రలేమి సమస్య మెద‌డుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.


. తగినంత నిద్రలేకపోతే జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గిపోతుంది.


. నిద్రలేకపోతే పనిమీద ఏకాగ్రత ఉండదు.


. నిద్రలేమి సమస్య ఊబకాయం, బరువు పెరగటం వంటి సమస్యలకు దారి తీస్తుంది.


. నిద్రలేమి సమస్య వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి.


. 6 గంటల కన్నా తక్కువ నిద్రపోయేవారు రోజంతా నీరసంగా, నిరుత్సాహంగా ఉంటారు. ఏ పని చేయలేరు, చురుకుదనం లోపిస్తుంది.


. నిద్రలేకపోతే శరీరానికి తగిన ఆక్సిజ‌న్ ల‌భించ‌దు. శరీరానికి ఆక్సిజన్ అందకపోతే ఒత్తిడి, ఆందోళ‌న వంటి సమస్యలు తలెత్తుతాయి.


. విద్యార్థులు తప్పకుండా 7 గంటలు నిద్రపోవాలి. లేకపోతే చదువుకున్నవి ఏవీ గుర్తు ఉండవు.


. శరీరానికి సరిపడా నిద్రలేకపోతే ‘డిప్రెష‌న్’(కుంగుబాటు)కు గురువుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com