పాకిస్థాన్ కుయుక్తులను భద్రతా దళాలు తిప్పికొట్టాయి. దొంగదెబ్బ తీయాలని పాక్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శనివారం ఉదయం 5.50 గంటల సమయంలో జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లా సరిహద్దులో... పాక్ సైన్యం డ్రోన్కు ఆయుధాలు అమర్చి భారత జవాన్లపై దాడికి యత్నించింది. గమనించిన భారత బలగాలు వెంటనే అప్రమత్తమై డ్రోన్ను కూల్చివేశాయి. డ్రోన్కు అమర్చిన ఆయుధాలను బీఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈఘటనతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి.