లాక్డౌన్లో హాయిగా తిని కూర్చుంటున్నారా.. వ్యాయమాలు చేయడం కూడా మర్చిపోయి ఎంజాయి చేస్తున్నారా? అయితే మీరు కూడా ఇతనిలా ప్రాణాప్రాయ స్థితికి చేరుకోవచ్చు. కనీసం లేవలేని పరిస్థితికి చేరవచ్చు. ఇంతకు అతనెవరు ఆయనలాగా మారడం అంటే ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. ఉహాన్కు చెందిన జహౌ అనే 29 ఏళ్ల యువకుడు ఓ కేఫ్లో పనిచేసేవాడు. నిత్యం పనిలో బిజీగా ఉండటం వల్ల అప్పట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదు. ఎంతో ఉత్సాహంగా సాగుతున్న అతడి జీవితంలో కరోనా లాక్డౌన్ ఊహించని మార్పులు తెచ్చింది. కరోనా వైరస్కు పుట్టినిల్లైన ఉహాన్లో వైరస్ తీవ్రత పెరగడంతో చైనా ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ప్రజలను బయటకు రానివ్వకుండా ఇళ్లల్లోనే బంధించింది. దీంతో జహౌ కూడా ఐదు నెలలు ఇంటికే పరిమితమయ్యాడు.అప్పటికే బొద్దుగా క్యూట్గా సుమారు వంద కిలోల బరువున్న జహౌ ఐదు నెలల వ్యవధిలో అదనంగా మరో 100 కిలోలకు పైగా బరువు పెరిగాడు. లాక్డౌన్ నుంచి ఉపశమనం కల్పించిన తర్వాత జహౌ బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. బరువు వల్ల అతడు నిద్ర కూడా పోలేని దుస్థితి ఏర్పడింది. ఒక సందర్భంలో అతడు 48 గంటలు నిద్రలేకుండా గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో ఆందోళనకు గురైన జహౌ ఎమర్జన్సీ సేవలను ఆశ్రయించాడు. ఎంతో కష్టపడి మెడికల్ టీం జహౌను హాస్పిటల్కు తరలించింది. ప్రస్తుతం అతడి బరువు 280 కిలోలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జహౌ ప్రస్తుతం ఉహాన్ యూనివర్శిటీలో చికిత్స పొందుతున్నాడు. మరి కొన్నాళ్లు అతడు అదే పరిస్థితిలో ఉండి ఉంటే గుండెనొప్పి, శ్వాసకోస సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం అతని పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని వైద్యులు తెలిపారు.