సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టూరిజం బోట్ కంట్రోల్ రూమ్లను ప్రారంభించారు. తాడిపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 9 కంట్రోల్రూమ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.... నదీతీర పర్యాటక ప్రాంతాల్లో సురక్షిత బోటింగ్ కోసం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. బోటింగ్ ఆపరేషన్స్ను జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలని సీఎం జగన్ అన్నారు. కంట్రోల్ రూమ్లు నిబంధనలు పాటిస్తున్నాయా లేదా పరిశీలించాలని అయన పేర్కొన్నారు. ఒక్కో కంట్రోల్ రూమ్లో తహసీల్దార్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఇరిగేషన్ అధికారులు, పోలీసులు నీటీ వ్యవస్థ, పర్యాటకుల భద్రత అంశాలను పరిశీలిస్తారని సీఎం జగన్ మోహ రెడ్డి తెలిపారు.