చైనాలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. 1200కు పైగా విమానాలు రద్దయ్యాయి. పాఠశాలలు కూడా మూతపడ్డాయి. స్థానిక జిన్ఫాడి హోల్సేల్ మార్కెట్లో తాజాగా మరోసారి కరోనా కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. బుధవారం తాజాగా 31 కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. రెండో సారి వ్యాపిస్తున్న మహమ్మారి తీవ్రత ఉధృతంగా ఉండటంతో.. ప్రజలను నివాసాల నుండి బయటకు రావద్దని ఆదేశించారు. బీజింగ్లోని 30 ప్రాంతాల్లో లాక్డౌన్ విధించారు. ఈ కేసులన్నీ జిన్ఫాడీ మార్కెట్లోనే ప్రారంభమైనట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో బుధవారం సుమారు 1255 విమనాలను రద్దు చేసినట్లు నగరంలోని రెండు విమానాశ్రయాలు ప్రకటించాయి. దీంతో బీజింగ్లో దాదాపు 70 శాతం విమాన రాకపోకలు నిలిచిపోనున్నాయి.బీజింగ్లోని అన్ని పాఠశాలలను మూసివేశామని అధికారులు తెలిపారు.