కరోనా రహిత దేశంగా న్యూజిలాండ్ ప్రకటించుకున్న సంగతి తెలిసింది. ప్రపంచ దేశాలన్నీ కరోనా కల్లోలంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ ప్రణాళికాబద్దంగా, వ్యూహాత్మక కట్టడి చర్యలతో న్యూజిలాండ్ మహమ్మారి వైరస్ పై విజయం సాధించింది. దేశంలో చిట్టచివరి కరోనా బాధితురాలు కూడా పూర్తిగా కోలుకుందని ఆ దేశ ప్రధాని స్వయంగా ప్రకటించారు. ఇది జరిగిన రోజుల వ్యవధిలో దేశంలో కొత్తగా మరో రెండు కరోనా కేసులు బయటపడ్డాయి. బ్రిటన్ నుంచి న్యూజిలాండ్ వచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. సుమారు 24 రోజుల అనంతరం ఆ దేశంలో మళ్లీ తొలిసారి వైరస్ కేసులు నమోదయ్యాయి. వారం రోజుల క్రితం న్యూజిలాండ్ లాక్డౌన్ ఆంక్షలను ఎత్తేసింది. భవిష్యత్తులో తమ దేశంలో కొత్తగా కరోనా కేసులు మళ్లీ నమోదయ్యే అవకాశాలున్నాయని, జాగ్రత్తగా ఉండాలని జెసిండా ప్రజలను హెచ్చరించారు.