అమరావతి : అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట బందోబస్తు. అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమీప ప్రాంతాల్లోనూ పోలీస్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. అసెంబ్లీ బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ సోమవారం సమీక్షించారు. పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. బందోబస్తు కోసం.. గుంటూరుతో పాటు ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిగోదావరి జిల్లాల నుంచి మొత్తం 3,080 మంది పోలీసులు, 105 మంది మార్షల్స్ అసెంబ్లీ ప్రాంతానికి చేరుకున్నారు.
గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్ ఎస్పీల పర్యవేక్షణలో *17 మంది డీఎస్పీలు, 44 మంది సీఐలు, 78 మంది ఎస్సైలు, పోలీస్ సిబ్బంది* విధులు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఆవరణలోను, అసెంబ్లీకి వెళ్లే మార్గంలోను పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చెక్పోస్టులు ఏర్పాటు చేసి అనుమతి ఉన్న వాహనాలకే దారి ఇవ్వనున్నారు.అసెంబ్లీ ప్రాంతంలోను, సమీప ప్రాంతాల్లోను సెక్షన్ 144 అమలులోకి తెచ్చారు.