కరోనా వైరస్ ఫ్రీ దేశంగా న్యూజిలాండ్ నిలిచింది. దీంతో న్యూజిలాండ్లో విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి జసిండా ఆర్డర్న్ ప్రకటించారు. కరోనా ఫ్రీ దేశంగా న్యూజిలాండ్ నిలవడంతో.. ప్రధాని సంతోషంతో ద్యాన్స్ చేసినట్లు అధికారులు తెలిపారు. న్యూజిలాండ్లో కరోనా వైరస్ను తరిమికొట్టామన్న నమ్మకం ఇప్పుడు కలిగిందన్నారు. ఇప్పుడు భౌతిక దూరం పాటించాల్సిన అవసరం లేదన్నారు.
ఐదు మిలియన్ల జనాభా ఉన్న న్యూజిలాండ్లో 1,154 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కగా, 22 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారందరూ కోలుకున్నారు. గత 17 రోజుల నుంచి ఏ ఒక్కరికి కూడా కరోనా సోకలేదు. ఒక వారంలో ఒక కేసు మాత్రమే నమోదైంది. ఆ వ్యక్తి కూడా ఈ వైరస్ నుంచి కోలుకున్నాడు. ఇక ఆంక్షలన్నింటినీ ఎత్తివేసి అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇవ్వనున్నారు. ప్రజా రవాణాకు కూడా అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.