ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. డబ్ల్యుహెచ్ఒతో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. కరోనా నియంత్రణలో డబ్ల్యుహెచ్ఒ విషలమైందంటూ వ్యాఖ్యానించారు. అపార ప్రాణ, ఆర్థిక నష్టాలకు డబ్ల్యుహెచ్ఒ, చైనాలే కారణమని ఆరోపించారు. ఈ మేరకు శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతే కాకుండా చైనా పైనా ఆంక్షలు విధించారు. అమెరికా స్టాక్ ఎక్సేంజీలో నమోదై, తమ దేశ చట్టాలను గౌరవించని చైనా కంపెనీలపైనా చర్యలు తీసుకుంటామన్నారు. డబ్ల్యుహెచ్ఒకు ఇచ్చే నిధులు ఇతర ప్రపంచ ప్రజారోగ్య సంస్థలకు మళ్లిస్తామని చెప్పారు.