ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు గట్టిగుణపాఠమని టీడీపీ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ఈ తీర్పుతో న్యాయం గెలిచిందన్నారు. అలాగే ప్రజలకు న్యాయ వ్యవస్థ గొప్పతనం మరోసారి తెలిసిందన్నారు. ఇటువంటి తీర్పులు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని నిలబెడతాయంటూ ట్వీట్ చేసిన నాని తన ట్వీట్ ను ముఖ్యమంత్రి జగన్ కు ట్యాగ్ చేశారు.