కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని చాగలమర్రి మండలం నేలంపాడులో సోమవారం పంటలను వ్యవసాయ శాస్త్రవేత్తలు వెంకటరమణమ్మ, రాఘవేంద్ర లు పరిశీలించారు. గ్రామంలో నకిలీ విత్తనాలతో నష్టపోయామని రైతులిచ్చిన ఫిర్యాదుతో వ్యవసాయ శాస్త్రవేత్తలు వెంకటరమణమ్మ, రాఘవేంద్ర పంటలను పరిశీలించారు.
గ్రామంలో దాదాపు 50 ఎకరాల్లో మినుము పంట నష్టపోయామని రైతులు వివరించారు. ఏఏ కారణాలతో పంటలు నాశనమయ్యాయో పూర్తిస్థాయి విచారణ చేపడతామని శాస్త్రవేత్తలు తెలిపారు. వ్యవసాయ అధికారిణి నహిదాబాను పాల్గొన్నారు.