ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాపై విజయం సాధించిన 113 ఏళ్ల మహిళ

international |  Suryaa Desk  | Published : Wed, May 13, 2020, 11:19 AM

కరోనా వృద్ధులకు అత్యధిక ప్రమాదకరంగా మారిందంటూ పలువురు తమ నివాసాల నుండి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. అయితే 113ఏళ్ల స్పెయిన్‌ మహిళ కరోనాపై విజయం సాధించి ఆ వాదనను తప్పని నిరూపించింది. వృద్ధాశ్రమంలో తనతో పాటు ఉంటున్న పలువురు ఈ వ్యాధి బారినపడి మృత్యువాతపడ్డారు. అయితే ఆమెలో మాత్రం వ్యాధి లక్షణాలు తక్కువగా కనిపించాయని నిర్వాహకులు తెలిపారు. అమెరికాకు చెందిన మరియా బ్రన్యాస్‌ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో గత 20 ఏళ్లుగా ప్రత్యేక వార్డులో ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె వ్యాధి నుండి కోలుకున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. గత వారం కరోనా పాజిటివ్‌ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా వచ్చిందని అన్నారు. దేశంలోనే అత్యంత వృద్ధ మహిళగా ఆమెపై స్పెయిన్‌ మీడియాలో అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. కాగా, ఆమె 1907 మార్చి 4న జన్మించారు. మొదటి ప్రపంచయుద్ధం సమయంలో ఆమె అమెరికా నుండి స్పెయిన్‌కు చేరుకున్నారు. స్పానిష్‌ ఫ్లూలను తన జీవితంలో చూశానని, స్పెయిన్‌లో సివిల్‌ వార్‌ జరిగిన సమయంలోనూ తన కుటుంబసభ్యులతో ఉన్నా నని అన్నారు. స్పెయిన్‌లో ఇప్పటికే 27 వేల కరోనా మరణాలు నమోదైనట్లు వైద్య శాఖ పేర్కొంది. ఈ మృతుల్లో అత్యధికంగా వృద్ధులే ఉన్నట్లు తెలిపింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com