ఏపీ సర్కార్ దశల వారీగా పూర్తిగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని తెలిపిన విషయం తెలిసిందే. జగన్ సర్కార్ వచ్చాక ముందుగా 4380 వైన్స్ షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి. వాటిని గతంలోనే 3500కు తగ్గించారు. ధరలను కూడా పెంచారు. తాజాగా లిక్కర్ పై 2 రోజుల్లోనే 75శాతం ధరలను పెంచారు. అయినా కూడా మందు బాబులు వెనుకడుగు వేయకుండా కొనుగోలు చేస్తున్నారు. ఐతే మందు బాబులకు షాకిచ్చేలా ఏపీ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 3500 షాపులను 2934కు తగ్గిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరు నాటికి షాపుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఏఏ జిల్లాలో ఏ షాపులను తీసేశారు అనే దాని పై ఎక్సైజ్ శాఖ త్వరలోనే ప్రకటన చేయనుంది. దశలవారీగా మద్యపానాన్ని నిషేధించాలనే ఉద్దేశ్యంతోనే సర్కార్ ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తోంది. అసలే రేటు పెరిగి ఇబ్బంది పడుతున్న మందు బాబులకు షాపుల సంఖ్య తగ్గించడం మరో షాక్ గా చెప్పవచ్చు.