ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్సనల్ లోన్ తీసుకున్న వారికి ఎలక్ట్రానిక్ కార్డ్స్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 24, 2020, 03:40 PM

బ్యాంక్ నుంచి డెబిట్ కార్డు పొందాలంటే కచ్చితంగా ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఉండాలి. సేవింగ్స్ ఖాతా లేదంటే కరెంట్ అకౌంట్ కలిగి ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు బ్యాంక్‌లో అకౌంట్ లేకపోయినా కూడా డెబిట్ కార్డు పొందొచ్చు. అయితే దీనికి పర్సనల్ లోన్ తీసుకొని ఉండాలి. అంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఉంటే మీకు ఎలక్ట్రానిక్ కార్డు రానుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా నిబంధలను సడలించింది. ఇందులో భాగంగా బ్యాంకులు పర్సనల్ లోన్ తీసుకున్న వారికి కూడా ఎలక్ట్రానిక్ కార్డులు జారీ చేయనున్నాయి. ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్ కలిగిన వారికి ఎలక్ట్రానిక్ కార్డుల జారీకి ఆర్‌బీఐ తాజాగా అంగీకారం తెలిపింది. ఇది పర్సనల్ లోన్ తీసుకున్న వారికే వర్తిస్తుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. పర్సనల్ లోన్ కలిగిన వారికి ఎలక్ట్రానిక్ కార్డులు జారీ చేస్తారు. బ్యాంక్ లోన్ గడువు వరకు ఈ కార్డులకు కూడా వాలిడిటీ ఉంటుంది. తర్వాత ఉండదు. కార్డుల జారీ అనేది బ్యాంకుల ఇష్టం. కొన్ని నిబంధనలను అనుగుణంగానే కార్డుల జారీ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రానిక్ కార్డులను కేవలం దేశీ లావాదేవీలకు మాత్రమే వినియోగించాలి. అలాగే ఈ కార్డుల ద్వారా ఆన్‌లైన్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్లను మాత్రమే నిర్వహించగలం. అంటే నగదు లావాదేవీలకు ఈ కార్డు ఉపయోగపడదు. ఈ కార్డులను ఉపయోగించాలంటే చెక్స్, తగిన నిల్వలు ఉంచాల్సి ఉంటుంది. అయితే ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్లపై పొందే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ క్యాష్ ట్రాన్సాక్షన్లకు ఈ కొత్త రూల్స్ వర్తించవని ఆర్‌బీఐ తెలిపింది. కాగా బ్యాంకులు ఈ కొత్త సదుపాయాన్ని కస్టమర్లకు అందించేందుకు ముందుగానే తగిన పాలసీని ఏర్పాటు చేసుకోవాలని, దీనికి బ్యాంక్ బోర్డు ఆమోదం తీసుకోవాలని సూచించింది. రిస్క్ మేనేజ్‌మెంట్, క్రమానుగత సమీక్ష, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని పాలసీని రూపొందించిన తర్వాతనే ఎలక్ట్రానిక్ కార్డులను జారీ చేయాలని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com