భారత్ లో దాదాపు 3 కోట్ల కిరాణ దుకాణాలు త్వరలోనే డిజిటల్ వైపు అడుగులు వేస్తాయని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. జియోలో ఫేస్ బుక్ వాటా కొనుగోలు చేయడం దేశాన్ని మరింత డిజిటల్ వైపుకు తీసుకెళుతుందన్నారు. ఫేసుబుక్ భాగస్వామ్యంతో జియో ఈ- కామర్స్ వైపు అడుగులు వేస్తున్నామన్నారు. దీని ద్వారా ప్రతి ఒక్కరు తమకు కావాల్సిన నిత్యావసరాలను రోజు వారీగా ఆన్ లైన్ లో కొనుగోలు చేసే అవకాశం కలుగుతుందన్నారు. కస్టమర్లకు కావాల్సిన నిత్యావసరాలు క్షణాల్లో అందుబాటులో ఉంటాయన్నారు.