వియత్నాం.. చైనా సరిహద్దు దేశం. అధిక జన సాంద్రత కలిగిన దేశం. ఇప్పటి వరకూ అక్కడ కరోనా సోకిన వారిలో మరణాలు లేవు. ఈ యుద్ధంలో వియత్నాం గెలుపు బాటలో ఉంది. చైనాతో ఆ దేశం 1100 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నా.. దాని ప్రభావానికి లోనుకాకుండా కరోనాను తనదైన శైలిలో కట్టడి చేసింది. జనవరి చివరి వారంలో వియత్నాం కొత్త సంవత్సరం పండగ జరుపుకుంటున్న రోజే ఆ దేశ ప్రభుత్వం '' మనం కరోనాపై యుద్ధం ప్రకటించాం'' అని తెలియజేసింది. ఇంకా అప్పటికీ కరోనా చైనాకే పరిమితమై ఉంది. అతి తక్కువ కాలంలోనే దేశంలోకి కరోనా ప్రవేశించొచ్చని కూడా అంచనా వేశారు. అప్పటి నుంచి దేశంలో కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. వియత్నాం దగ్గర వనరులు తక్కువ కాబట్టి వారు క్వారంటైన్ను పటిష్టంగా అమలు చేశారు. రెండోది వైరస్ సోకిన వారితో కాంటాక్ట్ అయినవారిని గుర్తించడంపై వారు దృష్టి పెట్టారు. ఈ చర్యలను ప్రారంభ రోజుల నుంచే పాటించడం ఆ దేశానికి చాలా ఉపయోగపడింది. హనోరు నగరంలో పది కరోనా కేసులు నిర్ధారణ అయిన వెంటనే పదివేల జనాభా కలిగిన ఆ పట్టణాన్ని మొత్తం క్వారంటైన్ చేశారు. ప్రతి ఒక్కరి సమాచారాన్నీ పూర్తి వివరాలతో రికార్డు చేశారు. వియత్నాంలో నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉంది. అందుకే వియత్నాంలో కేసులు 263. అందులో కోలుకున్నవారు 203 మంది. మరణాలు సున్నా. అక్కడున్న కమ్యూనిస్టు పార్టీ తగిన చర్యలు తీసుకోవడం వల్లే వియత్నాం కరోనాను జయించింది.